భారత్‌లో కొత్తగా 61,537 మందికి కరోనా

మొత్తం కేసులు 20,88,612..మృతుల సంఖ్య మొత్తం 42,518

india- corona virus

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. ఈరోజు ఉదయం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 61,537 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 933 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 20,88,612కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 42,518కి పెరిగింది. 6,19,088 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 14,27,006 మంది కోలుకున్నారు. కాగా, నిన్నటి వరకు మొత్తం 2,33,87,171 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 5,98,778 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/