60 కిలోల బంగారారు ఆభరణాలు స్వాధీనం

బెంగళూరు: లెక్కలో చూపని 60 కేజీల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఈ నెల 25న కర్ణాటక కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు బెంగళూరు చిక్పేట ప్రాంతంలో గల రంగనాథ్ మాన్షన్, సకాలజీ మార్కెట్లోని హోల్సేల్ ఆభరణాల డీలర్లపై రైడ్ చేశారు. ఈ సందర్భంగా లెక్కలో చూపని 60 కేజీల బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆభరణాల విలువ రూ. 21 కోట్లుగా సమాచారం. రూ.1.3 కోట్ల జీఎస్టీని తప్పించుకునేందుకు వ్యాపారులు యత్నించారు.
తాజా అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/