దేశంలో కొత్తగా 6093 కరోనా కేసులు

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో కొత్తగా 6093 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,44,84,729కి చేరాయి. ఇందులో 4,39,06,972 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,121 మంది మృతిచెందారు. మరో 49,636 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 9768 మంది కరోనా నుంచి బయటపడగా, 18 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక మొత్తం కేసుల్లో 0.11 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.70 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 214.55 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/