దేశంలో 60వేలకు తగ్గిన కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,70,881
మొత్తం మృతుల సంఖ్య 3,77,031

న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నది. నిన్న 60,471 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం… నిన్న 1,17,525 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,70,881కు చేరింది. మరో 2,726 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,77,031కు పెరిగింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,82,80,472 మంది కోలుకున్నారు. 9,13,378 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 25,90,44,072 మందికి వ్యాక్సిన్లు వేశారు.

కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 38,13,75,984 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న17,51,358 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/