తెలంగాణలో కొత్తగా 592 కేసులు

మరో ముగ్గురు మృతి

592 new corona cases in Telangana
592 new corona cases in Telangana

Hyderabad: రాష్ట్రంలో కరోనా వైరస్‌ మహ మ్మారి కొంతతగ్గింది. శనివారం నాడు 592 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఈ మేరకు అన్ని వివరాలతో కూడిన బులెటిన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.ఇప్పటివరకు రాష్ట్రంలో 2,81,414 పాజిటీవ్‌ కేసులు నమోదయ్యాయి.

కరోనాతో ఈ ఒక్క రోజులో ముగ్గురు మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1513కి చేరింది. శనివారంనాడు 41,970మందికి కరోనా పరీక్షలు నిర్వహిం చారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 64, 43,052 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

ఇప్పటివరకు కరోనా నుంచి 2,73,013 మంది కోలుకోగా (97.01శాతం) శనివారంనాడు 643 మంది కోలుకున్నారు), మొత్తం యాక్టీవ్‌ కేసుల సంఖ్య 6888కు చేరింది. ఇందులో 4719మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. శనివారంనాడు నమోదైన కేసుల్లో జిహెచ్‌ఎంసి పరిధిలో 119 కరోనా పాజిటీవ్‌ కేసులు నమో దయ్యాయి.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/