దేశంలో కొత్తగా 58,077 కరోనా కేసులు
మొత్తం మరణాల సంఖ్య 5,07,177
న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గాయి. నిన్న దేశంలో 58,077 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న 1,50,407 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా వల్ల 657 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 6,97,802 మంది చికిత్స తీసుకుంటున్నారు. కరోనా మరణాల సంఖ్య మొత్తం 5,07,177కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.89 శాతంగా ఉంది. ఇప్పటి వరకు మొత్తం 1,71,79,51,432 డోసుల కరోనా వ్యాక్సిన్లు వినియోగించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/