రాజస్థాన్లో కొత్తగా మరో 57 కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,636
జైపూర్: రాజస్థాన్లో కరోనా మహమ్మారి తన పంజా విసురుతుంది. రాష్ట్రంలో ఈరోజు కొత్తగా మరో 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 3,636కు పెరిగినట్టు అధికారులు వెల్లడించారు. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క ఉదయ్పూర్లోనే అత్యధికంగా 20 కేసులు నమోదయ్యాయి. 15 కేసులతో తర్వాతి స్థానంలో జైపూర్ ఉంది. కాగా అజ్మీర్లో 11, పాలిలో 3, రాజ్సమంద్, చురూల్లో రెండేసి చొప్పున కరోనా కేసులు నమోదు కాగా.. కోల, బర్మర్, జాలోర్, దౌసాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఈ మహమ్మారి బారిన పడినట్టు గుర్తించారు కాగా కరోనా వైరస్తో రాజస్థాన్లో ఇప్పటి వరకు 103 మంది మృతి చెందారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/