దేశంలో కొత్తగా 5,383 కరోనా కేసులు

యాక్టివ్ కేసులు..45,281

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో కరోనా కేసులు సంఖ్య స్థిరంగా ఉంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 5,383 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 20 మంది చనిపోయారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.10 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో గురువారం 14,91,017 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 217.26 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,20,187 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 4,21,809 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,170 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,90,65,131కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 65,36,520 మంది మరణించారు. మరో 5,85,275 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,89,34,274కు చేరింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/