భారత్లో క్తొతగా 52,509 మందికి కరోనా
మొత్తం కేసులు 19,08,255..మొత్తం మృతులు 39,795
న్యూఢిల్లీ: భారత్లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో భారత్లో 52,509 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 857 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 19,08,255కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 39,795కి పెరిగింది. 5,86,244 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 12,82,216 మంది కోలుకున్నారు. కాగా, నిన్నటి వరకు మొత్తం 2,14,84,402 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 6,19,652 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది. ఈ మేరకు ఈరోజు ఉదయం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను తెలిపింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/