దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ఒక్కరోజే 5,233 కొత్త కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజువారీ ​ కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 5,233 మంది వైరస్​ బారినపడ్డారు. ఒక్కరోజే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం 3345 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.72 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.22 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్​ కేసుల సంఖ్య 0.07 శాతం వద్ద ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 1.67 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేటు 1.12% గా వద్ద ఉంది. 93 రోజుల తర్వాత రోజువారీ కేసులు ఐదువేలకు పైగా నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

కాగా, భారత్​లో మంగళవారం 14,94,086 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,94,43,26,416కు చేరింది. మరో 3,13,361 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ప్రపంచదేశాల్లో కరోనా కేసులు ఒక్కరోజే 5,42,669 కేసులు వెలుగుచూశాయి. మరో 1510 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 536,473,762కు చేరింది. మరణాల సంఖ్య 6,323,279కు చేరింది. ఒక్కరోజే 650,670 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 507,524,529గా ఉంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/