భారత్‌లో కొత్తగా 50,357 మందికి కరోనా

మొత్తం కరోనా కేసుల సంఖ్య 84,62,081..మొత్తం మృతుల సంఖ్య 1,25,562

India corona cases

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో 50,357 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 84,62,081 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 53,920 మంది కోలుకున్నారు. అలాగే గడచిన 24 గంట‌ల సమయంలో 577 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,25,562 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 78,19,887 మంది కోలుకున్నారు. 5,16,632 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 11,65,42,304 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,13,209 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/