తెలంగాణలో కొత్తగా 491 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,78,599..మొత్తం మృతుల సంఖ్య 1,499

corona virus – telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 491 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం… గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 596 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,78,599కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,69,828 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,499కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 7,272 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 5,169 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 102, రంగారెడ్డి జిల్లాలో 35 కరోనా కేసులు నమోదయ్యాయి.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/