దేశంలో 24 గంటల్లో 48,916 కొత్త కేసులు

మొత్తం మృతుల సంఖ్య 31,358

india- coronavirus

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. గత 24 గంటల్లో భారత్‌లో 48,916 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 757 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 13,36,861కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 31,358కి పెరిగింది. 4,56,071 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 8,49,431 మంది కోలుకున్నారు. కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,58,49,068 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 4,20,898 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. ఈ మేరకు ఈరోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను తెలిపింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/