దేశంలో కొత్తగా 4,858 కరోనా కేసులు

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 48,858

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో గడిచిన 24 గంటల్లొ కొత్తగా 4,858 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 4,735 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 48,027 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 4,39,62,664 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 5,28,355 మంది కరోనాతో మృతి చెందారు.

దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 2.76 శాతంగా, రికవరీ రేటు 98.71 శాతంగా, మరణాల రేటు 1.19 శాతంగా, క్రియాశీల రేటు 0.11 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,16,70,14,127 డోసుల కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేశారు. నిన్న 13,59,361 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/