భారత్లో కొత్తగా 46,148 కరోనా కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,79,331
మొత్తం మృతుల సంఖ్య 3,96,730
corona virus -india
న్యూఢిల్లీ: దేశం లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో నిన్న 46,148 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దాని ప్రకారం.. 24 గంటల్లో 58,578 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,79,331కు చేరింది.
ఇక మరణాల విషయానికొస్తే నిన్న 979 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,96,730కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,93,09,607 మంది కోలుకున్నారు. 5,72,994 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. దేశంలో రికవరీ రేటు 96.80 శాతంగా ఉంది. ఇప్పటి వరకు మొత్తం 32,36,63,297 డోసుల వ్యాక్సిన్లు వేశారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/