భారత్‌లో 24 గంటల్లో 45,720 కొత్త కేసులు

మొత్తం కేసులు 12,38,635…మృతుల సంఖ్య మొత్తం 29,861

india- corona virus

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో భారత్‌లో 45,720 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 1,129 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 12,38,635కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 29,861కి పెరిగింది. 4,26,167 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 7,82,606 మంది కోలుకున్నారు. కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,50,75,369 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,50,823 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు తెలిపింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/