దేశంలో కొత్త‌గా 44,111 పాజిటివ్ కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,02,362
మొత్తం మృతుల సంఖ్య 4,01,050

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 44,111 కొత్త కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 24 గంట‌ల్లో 57,477 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,05,02,362కు చేరింది. ఇక మరణాల విషయానికొస్తే, నిన్న‌ 738 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,01,050కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,96,05,779 మంది కోలుకున్నారు. 4,95,533 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. మొత్తం 34,46,11,291 వ్యాక్సిన్ డోసులు వేశారు.

కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 41,64,16,463 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 18,76,036 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/