భారత్‌లో కొత్తగా 43,893 మందికి కరోనా

మొత్తం కరోనా కేసుల సంఖ్య 79,90,322..మొత్తం మృతుల సంఖ్య 1,20,010

corona virus- india

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం బులిటెన్ విడుదల చేసింది. దేశంలో కొత్తగా 43,893 మందికి కరోనా నిర్ధారణ అయిందని పేర్కొంది. అదే సమయంలో 58,439 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 79,90,322 కి చేరింది. గ‌త 24 గంట‌ల సమయంలో 508 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,20,010 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 72,59,509 మంది కోలుకున్నారు. 6,10,803 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 10,54,87,680 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 10,66,786 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/