ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 438 కేసులు
మరో ఇద్దరు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఆదివారం ఉదయానికి గత 24గంటల వ్యవధిలో కొత్తగా 438 పాజి టివ్ కేసులు నమోదయ్యాయి. ఎపి వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటిన్ సమా చారాన్ని అనుసరించి.
గడిచిన ఒక రోజు వ్యవధిలో 64,236 మంది నుంచి నమూ నాలను సేకరించి పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల ద్వారా కొత్త పాజిటివ్ కేసులు గుర్తించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,12,60,810మంది నుంచి సేకరించిన నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహిం చారు. వీటి ద్వారా మొత్తంగా 8778723 మందిలో కరోనా పాజిటివ్ కేసులు గుర్తించారు.
గడిచిన రోజు వ్యవధిలో కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయిన వారు 589 మంది ఉంటే, ఇప్పటి వరకు మొత్తంగా 867445 మంది కరోనా నుంచి కోలుకొన్నారు. ప్రస్త్తుతం రాష్ట్ట్రంలో 4202 కరోనా యాక్టివ్ కేసులు వివిధ కోవిడ్ ఆస్పత్రుల్ల్లో చికిత్సను పొందుతున్నారు.
రాష్ట్ట్రంలో అత్యధిక కరోనా పాజి టివ్ కేసులు తూర్పుగోదావరి జిల్ల్లాలో నమో దయ్యాయి. ఇక్కడ మొత్త్తంగా 123305 పాజిటివ్ కేసులను గుర్త్తించారు. రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కరోనాతో ఇద్దరు మర ణించారు. దీంతో రాష్ట్రంలో 7076 మంది కరోనాతో మృత్యువాత పడినట్లు గుర్తించారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/