దేశంలో కొత్తగా 43,733 కరోనా కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,63,665
మొత్తం మృతుల సంఖ్య 4,04,211
న్యూఢిల్లీ : దేశంలో కరోనా రోజువారీ కేసులతో పాటు మరణాలు మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లో 43,733 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే, 24 గంటల్లో 47,240 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,63,665కు చేరింది.
మరణాల విషయానికొస్తే, నిన్న 930 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,04,211కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,97,99,534 మంది కోలుకున్నారు. 4,59,920 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. మొత్తం 36,13,23,548 వ్యాక్సిన్ డోసులు వేశారు. కరోనా కేసుల రికవరీ రేటు 97.18 శాతంగా ఉంది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/