దేశంలో కొత్తగా 43,509 కరోనా కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,15,28,114
మృతుల సంఖ్య మొత్తం 4,22,662
న్యూఢిల్లీ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 43,509 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,15,28,114కు చేరింది. అలాగే, నిన్న 38,465 మంది కోలుకున్నారు.
మరణాల విషయానికొస్తే… నిన్న 640 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,22,662కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,07,01,612 మంది కోలుకున్నారు. 4,03,840 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/