భారత్లో కొత్తగా 43,082 కరోనా కేసులు
93లక్షలు దాటిన కొవిడ్ కేసులు
న్యూఢిల్లీ: భారత్లో కొత్తగా 43,082 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 93,09,788కి చేరాయి. కొత్తగా మరో 492 మంది మహమ్మారికి బలవగా.. మరణాల సంఖ్య 1,35,715కి చేరింది. క్రియాశీల కేసులు 4,55,555 ఉన్నాయని కేంద్రం తెలిపింది. 24 గంటల్లో 39,379 కొత్త డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 87,18,517 మంది కోలుకున్నారు. ఇదిలా ఉండగా..గురువారం ఒకే రోజు 11,31,204 టెస్టులు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 13,70,62,749 టెస్టులు చేసినట్లు వివరించింది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/