దేశంలో కొత్తగా 42,982 క‌రోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,12,114
మృతుల సంఖ్య మొత్తం 4,26,290

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 42,982 కొత్త కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 24 గంట‌ల్లో 41,726 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,18,12,114కు చేరింది.

ఇక మరణాల విషయానికొస్తే… నిన్న‌ 533 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,26,290కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,09,74,748 మంది కోలుకున్నారు. 4,11,076 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 48,93,42,295 వ్యాక్సిన్ డోసులు వేశారు.

కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 47,48,93,363 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 16,64,030 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/sports/