దేశంలో కొత్తగా 42,625 కరోనా కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,17,69,132
మృతుల సంఖ్య మొత్తం 4,25,757
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉన్నది. గడిచిన 24గంటల్లో 42,625 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే, 24 గంటల్లో 36,668 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,17,69,132కు చేరింది.
ఇక మరణాల విషయానికొస్తే… నిన్న 562 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,25,757కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,09,33,022 మంది కోలుకున్నారు. 4,10,353 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు మొత్తం 48,52,86,570 వ్యాక్సిన్ డోసులు వేశారు. నిన్న 62,53,741 డోసులు వేశారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/