దేశంలో కొత్తగా 42,618 క‌రోనా కేసులు

మొత్తం కేసుల సంఖ్య 3,29,45,907
మొత్తం మృతుల సంఖ్య 4,40,225

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 42,618 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,29,45,907కి చేరింది. అలాగే, నిన్న 36,385 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 330 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,40,225కి పెరిగింది.

ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,21,00,001 మంది కోలుకున్నారు. 4,05,681 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 67,72,11,205 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. నిన్న ఒక్క రోజే 58,85,687 డోసులు వేశారు. మరోపక్క, నిన్న ఒక్క‌ కేర‌ళ‌లోనే 29,322 కేసులు న‌మోదు కాగా, ఆ రాష్ట్రంలో 131 మంది ప్రాణాలు కోల్పోయారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/