దేశంలో కొత్తగా 4,184 కరోనా కేసులు

యాక్టివ్ కేసుల సంఖ్య 44,488

corona virus -india

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల సంఖ్య 5 వేల కంటే తక్కువగా నమోదవుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 4,184 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 104 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం 44,488 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు 4,24,20,120 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 5,15,459 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 1,79,53,95,649 డోసుల వ్యాక్సిన్ వేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/