దేశంలో కొత్తగా 41,649 క‌రోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,16,13,993
మృతుల సంఖ్య మొత్తం 4,23,810

న్యూఢిల్లీ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,649 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 24 గంట‌ల్లో 37,291 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,16,13,993కు చేరింది.

మరణాల విషయానికొస్తే… నిన్న‌ 593 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,23,810కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,07,81,263 మంది కోలుకున్నారు. 4,08,920 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 46,15,18,479 వ్యాక్సిన్ డోసులు వేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/