భారత్‌లో కొత్తగా 41,322 పాజిటివ్‌ కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 93,51,110..మొత్తం మృతుల సంఖ్య 1,36,200

corona virus- india

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 41,322 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 93,51,110 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 41,452 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 485 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,36,200 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 87,59,969 మంది కోలుకున్నారు. 4,54,940 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/