దేశంలో కొత్తగా 41,195 పాజిటివ్ కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి కొనసాగున్నది. గడిచిన 24గంటల్లో కొత్తగా 41,195 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదే సమయంలో 39,069 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 490 మంది కరోనా బాధితులు మృతి చెందారు.

కొత్త కేసులతో కలిపి దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,20,77,706 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 3,12,60,050 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 4,29,669 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 3,87,987 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 97.45 శాతానికి చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.94 శాతంగా ఉందని వెల్లడించింది. యాక్టివ్ కేసులు 1.94 శాతంగా ఉన్నాయిని పేర్కొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/