దేశంలో కొత్తగా 40,134 క‌రోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,16,95,958
మృతుల సంఖ్య మొత్తం 4,24,773

న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో 40,134 కొవిడ్‌ కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 24 గంట‌ల్లో 36,946 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,16,95,958కు చేరింది.

మరణాల విషయానికొస్తే… నిన్న‌ 422 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,24,773కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,08,57,467 మంది కోలుకున్నారు. 4,13,718 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 47,22,23,639 వ్యాక్సిన్ డోసులు వేశారు. నిన్న‌ 17,06,598 డోసులు వేశారు.

తాజా వీడియో వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/videos/