ఎదురుకాల్పుల్లో నలుగురు ముష్కరులు హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఈరోజు ఉదయం 5 గంటలకు భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పుల్లో నలుగురు ముష్కరులు హతమయ్యారు. జమ్ముశ్రీనగర్ జాతీయ రహదారిపై నగరోటా వద్ద ఉన్న బాన్ టోల్ప్లాజాలో వాహనాలను తనిఖీ చేస్తుండగా, ఓ బస్సులో ఉన్న ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు ప్రాంభించాయని జమ్ము ఎస్పీ శ్రీధర్ పాటిల్ చెప్పారు. ఈ ఆపరేషన్లో సైనికులు కూడా పాల్గొన్నారని, ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు చనిపోయారని తెలిపారు. ఎన్కౌంటర్ సందర్భంగా జమ్ముశ్రీనగర్ జాతీయ రహదారిని భద్రతాదళాలు మూసివేశాయి. నగ్రోటా చెక్పోస్ట్ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/