నోయిడాలో కూలిన ప్రహరీగోడ.. నలుగురు మృతి

4 Dead As Part Of Noida Apartment Building’s Boundary Wall Collapses

లక్నోః ఉత్తర్​ప్రదేశ్​ నొయిడాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ హౌజింగ్​ సోసైటీ గోడ కూలి నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరికొద్ది మంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. సమాచారం ప్రకారం.. డ్రెయిన్‌ మరమ్మతులు చేస్తున్న సమయంలో 200 మీటర్ల పొడవున ప్రహరీ గోడ కూలిపోయినట్లుగా తెలుస్తున్నది. ఆ సమయంలో అక్కడ 12 మంది కూలీలు పని చేస్తున్నారు. స్థానికుల పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి పోలీసులు, రెస్క్యూ బృందాలు చేరుకొని.. శిథిలాలను తొలగిస్తున్నాయి. కాగా, ఈ ఘటన జల్​ వాయు విహార్​ సెక్టార్​ 21లో మంగళవారం ఉదయం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక, పోలీసు సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/