దేశంలో కొత్తగా 39,361 కరోనా కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,14,11,262
మృతుల సంఖ్య మొత్తం 4,20,967
న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో 39,361 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,14,11,262కు చేరింది. అలాగే, నిన్న 35,968 మంది కోలుకున్నారు.
మరణాల విషయానికొస్తే… నిన్న 416 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,20,967కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,05,79,106 మంది కోలుకున్నారు. 4,11,189 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు మొత్తం 43,51,96,001 వ్యాక్సిన్ డోసులు వేశారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/