దేశంలో కొత్తగా 39,097 క‌రోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,13,32,159

మృతుల సంఖ్య మొత్తం 4,20,016

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 39,097 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,13,32,159కు చేరింది. అలాగే, నిన్న 35,087 మంది కోలుకున్నారు. మరణాల విషయానికొస్తే… నిన్న‌ 546 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,20,016కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,05,03,166 మంది కోలుకున్నారు. 4,08,977 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 42,78,82,261 వ్యాక్సిన్ డోసులు వేశారు.

కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 45,45,70,811 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 16,31,266 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/