దేశంలో కొత్తగా 3805 కరోనా కేసులు

న్యూఢిల్లీః దేశంలో కరోనా రోజువారీ కేసులు రోజురోజుకు తగ్గుతూ వస్తున్నాయి. కొత్తగా 3805 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో దేశంలో మొత్తం కేసులు 4,45,91,112కు చేరాయి. ఇందులో 4,40,24,164 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,655 మంది మరణించారు. మరో 38,293 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 13 మంది మృతిచెందగా, 5069 మంది వైరస్ నుంచి బయటపడ్డారు.
కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 1.29 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.09 కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.73 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా 218.68 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/international-news/