తెలంగాణలో కొత్తగా 379 కరోనా కేసులు
మొత్తం కేసుల సంఖ్య 2,88,789
Hyderabad: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.
రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్ మేరకు గత 24 గంటల్లో అంటే మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ రాష్ట్రంలో మొత్తం 379 మందికి కరోనా సోకింది.
దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,88,789కి చేరింది. అదే సమయంలో కరోనా కాటుకు రాష్ట్రంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 1,559కి పెరిగింది.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/