దేశంలో కొత్తగా 37,875 క‌రోనా కేసులు

మొత్తం కేసుల సంఖ్య 3,30,96,718
మొత్తం మృతుల సంఖ్య 4,41,411

న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 37,875 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,30,96,718కి చేరింది. అలాగే, నిన్న 39,114 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 369 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,41,411కి పెరిగింది.

ఇక క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,22,64,051 మంది కోలుకున్నారు. 3,91,256 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. దేశంలో నిన్న 78,47,625 డోసుల వ్యాక్సిన్లు వేశారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 70,75,43,018 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. మరోపక్క, నిన్న ఒక్క‌ కేర‌ళ‌లోనే 25,772 కేసులు న‌మోదు కాగా, ఆ రాష్ట్రంలో నిన్న 189 మంది ప్రాణాలు కోల్పోయారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/