దేశంలో 40 వేల దిగువకు కొత్త కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,16,897
మొత్తం మృతుల సంఖ్య 3,97,637
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 37,566 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దాని ప్రకారం.. 24 గంటల్లో 56,994 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,16,897కు చేరింది.
ఇక మరణాల విషయానికొస్తే నిన్న 907 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,97,637కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,93,66,601 మంది కోలుకున్నారు. 5,52,659 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. దేశంలో రికవరీ రేటు 96.87 శాతంగా ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/