దేశంలో కొత్త‌గా 37,154 పాజిటివ్ కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,08,74,376
మృతుల సంఖ్య మొత్తం 4,08,764

న్యూఢిల్లీ : దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 37,154 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 24 గంట‌ల్లో 39,649 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,08,74,376కు చేరింది.

మరణాల విషయానికొస్తే, నిన్న‌ 724 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,08,764కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,00,14,713 మంది కోలుకున్నారు. 4,50,899 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశంలో ఇంతవరకు 37,73,52,501 వ్యాక్సిన్ డోసులు వేశారు. నిన్న 12,35,287 డోసులు వేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/