దుబ్బాకలో 11 గంటల వరకు 34.33 శాతం పోలింగ్‌

Dubbaka By-election 2020

దుబ్బాక: దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు 34.33 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారి తెలిపారు. కాగా సాధార‌ణ ఓట‌ర్ల‌కు సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఓటేసేందుకు అనుమ‌తి ఇవ్వ‌నున్నారు. సాయంత్రం 5 నుంచి 6 గంట‌ల వ‌ర‌కు కొవిడ్ బాధితుల‌కు ఓటేసేందుకు అవ‌కాశం ఇవ్వ‌నున్నారు. మొత్తం 315 పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఓట‌ర్లు బారులు తీరారు. కొవిడ్ నిబంధ‌న‌లు పాటించేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. స‌మ‌స్యాత్మ‌క‌మైన 85 పోలింగ్ కేంద్రాల వ‌ద్ద పోలీసులు భారీగా మోహ‌రించారు. ఈ ఉప ఎన్నిక‌లో మొత్తం 23 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/