దేశంలో కొత్తగా 34,703 క‌రోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,19,932
మృతుల సంఖ్య మొత్తం 4,03,281

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో 34,703 కొత్తగా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 24 గంట‌ల్లో 51,864 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06,19,932కు చేరింది.

ఇక మరణాల విషయానికొస్తే, నిన్న‌ 553 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,03,281కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,97,52,294 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 101 రోజుల క‌నిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. 4,64,357 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. మొత్తం 35,75,53,612 వ్యాక్సిన్ డోసులు వేశారు. క‌రోనా కేసుల రిక‌వ‌రీ రేటు 97.17 శాతంగా ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/