దేశంలో కొత్త‌గా 31,923 క‌రోనా కేసులు

మొత్తం మృతుల సంఖ్య 4,46,050

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. బుదవారం 27 వేలకుపైగా నమోదైన పాజిటివ్‌ కేసులు తాజాగా 31,923 క‌రోనా కేసులు నమోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య‌, ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, కొత్త‌గా 31,990 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 3,28,15,731కు చేరింది. కొత్త‌గా 282 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,46,050కు చేరింది. ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 187 రోజుల క‌నిష్ఠానికి చేరింది.

ప్ర‌స్తుతం 3,01,604 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో నిన్న 71,38,205 వ్యాక్సిన్ డోసులు వేశారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 83,39,90,049 వ్యాక్సిన్ డోసులు వేశారు. కాగా, నిన్న ఒక్క కేర‌ళ‌లోనే 19,675 మందికి వైర‌స్ సోకింది. అలాగే, నిన్న ఆ రాష్ట్రంలో 142 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/