భారత్‌ కొత్తగా 31,522 మందికి కరోనా

మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,67,372..మొత్తం మృతుల సంఖ్య 1,41,772

corona virus- india

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. గత 24 గంటల్లో 31,522 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 97,67,372కు చేరింది. ఇక గత 24 గంటల్లో 37,725 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 412 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,41,772కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 92,53,306 మంది కోలుకున్నారు. 3,72,293 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 15,07,59,726 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 9,22,959 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/