దేశంలో కొత్తగా 30,549 క‌రోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,17,26,507
మృతుల సంఖ్య మొత్తం 4,25,195

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 40,134 క‌రోనా కేసులు న‌మోదు కాగా, నిన్న‌ 30,549 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, 24 గంట‌ల్లో 38,887 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,17,26,507కు చేరింది.

మరణాల విషయానికొస్తే… నిన్న‌ 422 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,25,195కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,08,96,354 మంది కోలుకున్నారు. 4,04,958 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 47,85,44,114 వ్యాక్సిన్ డోసులు వేశారు. నిన్న‌ 61,09,587 డోసులు వేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/international-news/