దేశంలో కొత్తగా 30,256 కరోనా కేసులు
మొత్తం కేసుల సంఖ్య 33,478,419
మొత్తం మృతుల సంఖ్య 4,45,133
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,256 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కేసుల మొత్తం సంఖ్య 33,478,419 కి చేరింది. అలాగే, నిన్న 43,938 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశంలో కరోనాతో మరో 295 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,45,133కి పెరిగింది.
ఇక కరోనా నుంచి ఇప్పటివరకు 3,27,15,105 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,18,181 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. నిన్న దేశంలో 37,78,296 వ్యాక్సిన్ డోసులను ప్రజలకు వేశారు. ఇప్పటివరకు మొత్తం 80,85,68,144 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. కేరళలో కొత్తగా 19,653 కరోనా కేసులు నమోదుకాగా, 152 మంది మృతి చెందారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/