దేశంలో కొత్తగా 30,093 కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,093 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 45,254 మంది కరోనా నుంచి కోలుకోగా… 374 మంది మృతి చెందారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 3,11,74,322 కేసులు నమోదయ్యాయి.

మొత్తం 3,03,53,710 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 4,14,482 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 4,06,130 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 41,18,46,401 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/