భారత్‌లో కొత్తగా 30,005 మందికి కరోనా

మొత్తం 15,26,97,399 కరోనా పరీక్షలు..మొత్తం మృతుల సంఖ్య 1,42,628

corona virus- india

న్యూఢిల్లీ: భారత్‌ కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. గత 24 గంటల్లో 30,005 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 98,26,775కు చేరింది. ఇక గత 24 గంటల్లో 33,494 మంది కోలుకున్నారు.

గడచిన 24 గంట‌ల సమయంలో 442 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,42,628కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 93,24,328 మంది కోలుకున్నారు. 3,59,819 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 15,26,97,399 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 10,65,176 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/