విరిగిపడిన భారీ కొండచరియలు.. ఉత్తరాఖండ్‌లో చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులు

300 Travellers Stranded In Uttarakhand After Massive Landslide Cuts Off Road

డెహ్రాడూన్‌: చార్‌ధామ్‌ యాత్రలో భక్తులకు ఇబ్బందులు తలెత్తాయి. ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. భారీగా రాళ్లు పడటంతో లఖన్‌పూర్‌ సమీపంలో లిపులేఖ్‌-తవాఘాట్‌ రోడ్డు వంద మీటర్ల మేర ధ్వంసమైంది. దీంతో ధార్చులా, గంజీలో సుమారు 300 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. దెబ్బతిన్న రోడ్డును తెరవడానికి మరో రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.

కాగా, ఉత్తరకాశి, ఉదంసింగ్‌నగర్‌, గర్వాల్‌, చమోలీ, అల్మోరా సహా పలు జిల్లాల్లో దూళి, ఉరుములతో కూడిన వాన వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసులు కోరారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని, వాహనాలను జాగ్రత్తగా పార్క్‌ చేసుకోవాలని సూచించారు. యమునోత్రి , గంగోత్రి యాత్రకు వచ్చేవారు వాతావరణ పరిస్థితులను బట్టి తమ యాత్రను కొనసాగించాలన్నారు.