30వ ఇంటర్నేషనల్ స్నో ఛాంపియన్‌షిప్‌లో భారత్

ఐదు తలలున్న సర్పం శిల్పాన్ని రూపొందిస్తున్న భారత బృందం

snow-sculpture
snow-sculpture

కొలరాడో: ఈ నెల 20న అమెరికాలోని కొలరాడోలో మంచు శిలలతో కళా ఖండాలు చెక్కే పోటీలు ప్రారంభమైన్నాయి. మంచుతో రూపుదిద్దుకున్న అద్భుతమైన కళాఖండాలు సందర్శకులను తన్మయత్వంలో ముంచుతున్నాయి. ఈ పోటీల్లో మొత్తం 12 జట్లు పాలుపంచుకుంటున్నాయి. 30వ ఇంటర్నేషనల్ స్నో స్క్లప్చర్ ఛాంపియన్ షిప్ 2020 పేర నిర్వహిస్తోన్న ఈ పోటీల్లో భారత్ కూడా పాలుపంచుకుంటోంది. భారత బృందం ఐదు తలలున్న సర్పం శిల్పాన్ని చెక్కుతోంంది. మంగోలియాకు చెందిన సభ్యులు 20 టన్నులతో స్మార్ట్ ఫోన్ పట్టుకున్న కళాఖండాన్ని చెక్కారు. ఫ్రాన్స్ కు చెందిన కళాకారులు టోర్నడో దృశ్యాన్ని చెక్కారు. కాగా టర్కీ బృందం మంచు ముక్కలతో పజిల్ సర్కిల్ ను రూపొందించింది. చైనా బృందం జిన్హువా వాంగ్ విగ్రహాన్ని తయారు చేసింది. ఓ వైపు చలి తీవ్రంగా ఉన్నప్పటికీ.. సందర్శకులు చలితట్టుకునే దుస్తులు ధరించి మంచు కళాఖండాల పోటీలను తిలకించడానికి పోటెత్తుతున్నారు

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/