కొత్త ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

ప్రమాణస్వీకారం చేయించిన తెలంగాణ శాసనమండలి ఛైర్మన్

3-new-ts-mlcs-take-oath -ceremony

హైదరాబాద్‌: ‌ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్, బస్వరాజు సారయ్యలు ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. వీరి చేత తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. రాములు నాయక్, కర్నె ప్రభాకర్, దివంగత నాయిని నర్సింహారెడ్డిల పదవీ కాలపరిమితి ముగియడంతో… గత ఆగస్టు నాటికే మండలిలో గవర్నర్ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలకు సిఎం కెసిఆర్ వెంకన్న, దయానంద్, సారయ్యలను ఎంపిక చేశారు. మరోవైపు, తమకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి తాజా ఎమ్మెల్సీలు ధన్యవాదాలు తెలిపారు. ప్రమాణ స్వీకారానికి మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, సత్యవతి రాఠోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు హాజరయ్యారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/